Land mafia arbitrarily clearing the soil
- అనుమతులు లేకుండానే… మట్టి సొమ్ము చేసుకుంటున్న గ్రామ నాయకులు
- పంట పొలాలకు, గ్రామ అభివృద్ధి పేరుతో మట్టిని అమ్ముకుంటున్న నాయకులు
- మట్టితో తోడేందుకు కు అనుమతులు లేకున్నా వారి పై కేసులు పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్న అధికారులు
- కనీసం పరిశీలించేందుకు కూడా వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న అధికారులు
జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు వత్సవాయి మండలాల్లో ఇష్టారాజ్యంగా అనుమతులు లేకున్నా మట్టిని భారీ యంత్రాల సహాయంతో ఇటుక బట్టీలకు, ఫ్లాట్ లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న గ్రామ నాయకులు. ఇంత జరుగుతున్నా అధికారులకు తెలిసినప్పటికీ కూడా వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్న అధికారులు. ముడుపులు తీసుకుని కార్యాలయాల్లో ఉంటున్నారో లేక గ్రామ నాయకులుకు భయపడి కార్యాలయాల్లో ఉంటున్నారో తెలియని పరిస్థితి.
ఫిర్యాదులు చేస్తేనే పరిశీలిస్తాం అంటున్న అధికారులు. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్న కూడా అధికారులు కనీసం స్పందించకపోవడం పై గ్రామాల ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో అధికారులు పై ఉన్న నమ్మకం కోల్పోయే అవకాశం ఉందని మేధావులు తెలుపుతున్నారు. స్థానిక ప్రజలు ఏదైనా అవసరం కోసం కార్యాలయానికి వెళ్తే నిబంధనలు పాటించాలి సరైన పత్రాలు ఉండాలంటూ వంద కారణాలు చెప్పే అధికారులు ఈ రోజున ఎటు వెళ్లాయి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లోని చెరువులో నుంచి మట్టిని యంత్రాల సహాయంతో తోడు అమ్ముకుంటే సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక ట్రక్కు మట్టి తోలు కుంటే కేసులు బనాయించి అధికారులు ఇప్పుడు ఎటు పోయారు అంటూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మట్టితో లే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.