టాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగిన డార్లింగ్, వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఇప్పుడా క్లబ్లోకి చేరబోతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. సాహో ఫేమ్ సుజిత్ డైరెక్షన్లో రాబోతున్న ఒరిజనల్ గ్యాంగ్స్టర్ సినిమాకు పవర్ స్టార్ 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. అంతేకాదు సినిమా లాభాల్లోనూ షేర్ తీసుకుంటారని టాలీవుడ్లో టాక్ విన్పిస్తోంది. ఈ లెక్కన పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ వందకోట్లు దాటుందని లెక్కలు వేస్తున్నారు సినీ పండితులు.
పవన్ కల్యాణ్ సినిమాలంటే భారీ అంచనాలుంటాయ్. సినిమా అనౌన్స్ చేయడమే ఆలస్యం, ఆ హైప్ అలా క్రియేట్ అవుతుంది. అలాంటిది సాహోలాంటి యాక్షన్ మూవీ తీసిన సుజిత్ డైరెక్షన్లో, భారీ బడ్జెట్తో సినిమా రాబోతుండటం…అంచనాలు పెంచేసింది. పైగా పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తీయబోతున్న సినిమా ఇది. దాదాపు 175 కోట్లతో సినిమాను నిర్మిస్తున్నారు. దాంతో బజ్ ఏర్పడింది. కేవలం గంటన్నర వ్యవధి ఉండే ఈ మూవీలో పాటలు కూడా ఉండవని తెలుస్తోంది.
పవర్ స్టార్ సినిమాలు హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. ఓపెనింగ్స్ అదిరిపోతాయి. టాక్ ఎలా ఉన్నా మినిమం గ్యారంటీ. పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుందనేది నిర్మాతల గట్టి నమ్మకం. ఎందుకంటే పవన్ కల్యాణ్కు ఉన్న క్రేజ్ అలాంటిది. పవర్ స్టార్కు ఉన్నంత కల్ట్ ఫాలోయింగ్…టాలీవుడ్లో మరో ఏ హీరోకు లేదు. అందుకే ప్రొడ్యూసర్లు సైతం రిస్క్ చేస్తుంటారు. వకీల్సాబ్ భారీ లాభాలు తెచ్చి పెడితే, సోసో టాక్ వచ్చిన భీమ్లానాయక్ నిర్మాతకు నష్టాలను మాత్రం మిగల్చలేదు. ఒకవేళ ఏదైనా తేడా వచ్చిన పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్లో నుంచి కొద్దిగా షేర్ తిరిగి ఇచ్చేస్తుంటారు. లేదా మరో సినిమా తీసిపెడతారు. అందుకే పవర్ స్టార్ తో సినిమాలు తీసేందుకు పోటీ పడుతుంటారు ప్రొడ్యూసర్లు.
ఈ ఓజీ సినిమా కనీసం రూ. 200 కోట్లకు పైగా మార్కెట్ చేస్తేనే లాభాల బాట పడుతుందని మేకర్స్ అంచనా. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యహరిస్తున్నారు. భారీ హంగుల మధ్య తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్.