పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్వితీయ ఫామ్ కొనసాగుతూనే ఉంది. వెస్టిండీ్సతో బుధవారం జరిగిన తొలి డే/నైట్ వన్డేలో అతడు శతకం (103) బాదడంతో పాక్ 5 వికెట్లతో గెలిచింది. బాబర్కిది హ్యాట్రిక్ సెంచరీ కావడం విశేషం. గతంలోనూ అతను ఇలాగే హ్యాట్రిక్ శతకాలు నమోదు చేశాడు. దీంతో రెండు సార్లు మూడేసి వరుస సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్గా నిలిచాడు. అంతేకాదు.. వన్డేల్లో అత్యంత వేగం (13 ఇన్నింగ్స్)గా వెయ్యి పరుగులు పూర్తి చేసిన కెప్టెన్గా కోహ్లీ (17 ఇన్నింగ్స్)ని అధిగమించాడు. అంతకుముందు విండీస్ 50 ఓవర్లలో 305/8 స్కోరు చేసింది. ఈ భారీ ఛేదనను పాక్ 49.2 ఓవర్లలో ఐదు వికెట్లకు 306 పరుగులు చేసి గెలిచింది.