ఫస్ట్క్లాస్ క్రికెట్లో ముంబై జట్టు 92 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలుకొట్టింది. ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ క్వార్టర్స్ మ్యాచ్లో ఈ జట్టు ఏకంగా 725 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పరుగుల పరంగా ఏ జట్టుకైనా ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. 1929-30లో న్యూసౌత్ వేల్స్ జట్టు 685 పరుగుల తేడాతో క్వీన్స్లాండ్ను ఓడించిందే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది. అలాగే ఈ ఫలితంతో ముంబై జట్టు సెమీ్సలోనూ ప్రవేశించింది. యశస్వీ జైస్వాల్ (103), పృథ్వీ షా (72), ఆదిత్య తారె (57) చెలరేగడంతో ముంబై తమ రెండో ఇన్నింగ్స్ను 261/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 795 పరుగుల ఛేదన కోసం గురువారం బరిలోకి దిగిన ఉత్తరాఖండ్ 27.5 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. ధావల్ కులకర్ణి, ములాని, తను్షలకు మూడేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 647/8 డిక్లేర్, ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్లో 114 పరుగులు చేశాయి.