Raghunandan Rao: I can argue up to the Supreme Court
హైదరాబాద్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లైంగికదాడి కేసులో బాలిక ఫొటోలు, వీడియోలు విడుదల చేశారంటూ ఓ న్యాయవాది ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పై కేసు నమోదు చేశారు.
అయితే దీనిపై ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు.
ఆయన మాట్లాడుతూ…. బాలికకు న్యాయం చేయాలని తాను పోరాడుతుంటే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఇలాంటి కేసులకు తాను భయపడే వాడిని కాదని అన్నారు. కేసులు తనకు కొత్త కాదని తెలంగాణ ఉద్యమ సమయంలో తనపై 70కి పైగా కేసులు నమోదయ్యా యన్నారు. వాటిని ఇంతవరకు ఎదుర్కొని వచ్చానని చెప్పారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ఉన్నందున టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మౌనంగా ఉన్నాయని ఆరోపించారు.
ఎంఐఎం నేత కుమారుడిని కాపాడేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. వారికి కేసు వాదించేందుకు లాయర్లు కావాలని తనకు ఆ అవసరం లేదని, సుప్రీం కోర్టు వరకు తానే వాదించుకోగలనని తెలిపారు. వారికి చిత్తశుద్ధి ఉంటే బాలిక జీవితాన్ని నాశనం చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.