ఆంధ్రప్రదేశ్ టెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ(Department of School Education) ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. జూన్ 15 నుంచి జులై 15 వరకు ఆన్లైన్లో ఫీజులు చెల్లించాలని పేర్కొంది. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనుంది. ఆగస్టు 31న టెట్ ‘కీ’ విడుదల చేయనుంది. సెప్టెంబర్ 14న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.