ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లా శ్రీశైల జలాశయానికి గురువారం ఇన్ఫ్లో స్వల్పంగా కొనసాగుతోంది. సుంకేసుల జలాశయం నుంచి 4,311 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 819.10 అడుగుల వద్ద 40.2078 టీఎంసీలుగా నమోదయింది.