Gannavaram MLA Vallabhaneni Vamsi : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. Vallabhaneni Vamsi కి ఎడమ చేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిసింది.
ఏపీ రాజకీయాల్లో కీలక నేతగా Vallabhaneni Vamsi ప్రత్యేక గుర్తింపు ఉంది. Gannavaram నియోజకవర్గం నుంచి Telugudesam MLA గా గెలిచినప్పటికీ ప్రస్తుతం YSRCP సానుభూతిపరుడిగా Vallabhaneni Vamsi కొనసాగుతున్నారు. ఆయన ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ( ISB – Hyderabad ) లో గతేడాది సీటు సాధించి అడ్వాన్స్ డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ ( AMPPP ) కోర్సు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నుంచి Punjab రాష్ట్రం మొహాలీ క్యాంపస్ లో ఆఫ్ లైన్ తరగతులకు వెళ్తున్నారు.
ప్రస్తుతం మూడో సెమిస్టర్ తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం Vallabhaneni Vamsi కి ఎడమ చేయి విపరీతంగా లాగడంతో వెంటనే మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అక్కడి వైద్యులు Vallabhaneni Vamsi కి పలు పరీక్షలు నిర్వహించి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని చూసించారు. అయితే Vallabhaneni Vamsi ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.