Andhra Pradesh: 5 IPS officers transferred
కృష్ణా జిల్లా ఎస్పీగా పని చేస్తున్న సిద్ధార్థ్ కౌశల్ ను కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎస్పీ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేసారు. కృష్ణా జిల్లా ఎస్పీగా పి జాషువా ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. కోనసీమ ఎస్ పి సుబ్బారెడ్డి పై బదిలీ వేటు. అయన స్థానంలో కోనసీమ కొత్త ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డి నియమించింది. విజయవాడ డీసీపీగా విశాల్ గున్ని ను ప్రభుత్వం నియమించింది.